మెగాస్టార్ చిరంజీవిని కలిసిన టీమిండియా స్టార్ క్రికెటర్

by Disha Web Desk 2 |
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన టీమిండియా స్టార్ క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవిని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎస్ భరత్ కలిశారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషన్ పురస్కారం రావడంతో చిరంజీవిని స్వయంగా కలిసి భరత్ శుభాకాంక్షాలు చెప్పారు. ఈ విషయాన్ని భరత్ సోషల్ మీడియా తెలిపారు. అంతేకాదు.. ఈ సందర్భంగా కేఎస్ భరత్ తన టెస్టు జెర్సీని చిరంజీవికి అందించారు. మెగాస్టార్ కూడా తెలుగువాడిగా భారత జట్టులో అద్భుతంగా రాణిస్తున్నావని.. మున్ముందు గొప్ప గొప్ప పురస్కారాలు నువ్వు కూడా పొందాలని భరత్‌కు చిరంజీవి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

కాగా, ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌లో భాగంగా కేఎస్ భరత్‌ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ మ్యాచ్‌ను టీమిండియా చేజేతులా కోల్పోయింది. వరుసగా బ్యాట్‌మెన్లంతా చేతులెత్తెయడంతో ఇంగ్లాండ్‌కు గెలుసు సునాయాసం అయింది. ఈ మ్యాచ్‌లో కేఎస్ భరత్ ఫస్ట్ ఇన్సింగ్స్‌లో 41 పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు. సెకండ్ ఇన్సింగ్స్‌లో 28 పరుగులకే ఔట్ అయి పెవీలియన్ చేరారు.




Next Story

Most Viewed